ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాండస్‌ కలవరం

ABN, First Publish Date - 2022-12-09T23:59:30+05:30

జిల్లాలో రైతులను మాండస్‌ తుఫాన్‌ కలవరపెడుతోంది.

ధాన్యంపై టార్పాలిన్లు కప్పుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల గుండెల్లో గుబులు

పార్వతీపురం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి)/సాలూరు: జిల్లాలో రైతులను మాండస్‌ తుఫాన్‌ కలవరపెడుతోంది. చేతికందొచ్చిన పంటలను రక్షించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలులకు తోడు అక్కడక్కడా జల్లులు కురుస్తుండడంతో రైతన్నకు కంటి మీద కునుకు కరువవుతోంది. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చాలాచోట్ల కల్లాల్లోనే ధాన్యం రాశులు ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు శుక్రవారం సాలూరు మండలంలో మామిడిపల్లి, మర్రిపల్లి గ్రామాలతో పాటు గిరిజన పంచాయతీలైన సారిక, కురుకూటి, తోణాంలో రైతులు వరికోత పనుల్లో నిగమ్నమయ్యారు. కొందరు కోసిన పైరును కుప్పలుగా వేసి టార్పాలిన్లు కప్పారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని బస్తాలకెత్తి ఇళ్లకు తరలిస్తున్నారు. మొత్తంగా ధాన్యాన్ని భద్రపరిచేందుకు నానా తంటాలు పడుతున్నారు. తుఫాన్‌ గండం నుంచి తమను గట్టెక్కించాలని భగవంతుడిని వేడుకుంటున్నారు.

Updated Date - 2022-12-09T23:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising