ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గట్టెక్కించు‘నది’ ఎవరో!

ABN, First Publish Date - 2022-01-19T04:37:32+05:30

లాబేసు - పూర్ణపాడు వంతెనను పట్టించుకోకపోవడంపై గిరిజనులు మంగళవారం నాగావళి నదిలోనే నిరసన తెలిపారు. మంచంపై ఉన్న రోగిని నదిని దాటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మంచంపై రోగిని మోస్తూ నాగావళి నది దాటుతున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జ్వర పీడితుడితో నాగావళిలో నిరసన

కొమరాడ, జనవరి 18 : లాబేసు - పూర్ణపాడు వంతెనను పట్టించుకోకపోవడంపై గిరిజనులు మంగళవారం నాగావళి నదిలోనే నిరసన తెలిపారు. మంచంపై ఉన్న రోగిని నదిని దాటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  సంవత్సరాలుగా లాబేసు - పూర్ణపాడు వంతెన పూర్తి చేయకపోవడంతో నది ఆవల గ్రామాల ప్రజలు నిరంతరం అవస్థలు పడుతూనే ఉన్నారు. అనేక మార్లు నిరసనలూ తెలిపారు. తాజాగా మంగళవారం జ్వరంతో బాధపడుతున్న ఓ గిరిజనుని నదిని దాటిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. సీపీఎం నాయకులు కె.సాంబమూర్తి మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరైనట్లు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రకటించి ఏడాది కావస్తున్నా పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు. మంత్రి ప్రకటన పత్రికలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. నాగావళి ఆవలి గిరిజనులు అనారోగ్యం బారిన పడితే నదిలో దిగి అవతలి వైపునకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలాఖరులోగా వంతెన పనులు ప్రారంభించని పక్షంలో అన్ని పార్టీలు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.



Updated Date - 2022-01-19T04:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising