ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకు ఉచిత బియ్యం

ABN, First Publish Date - 2022-12-31T00:31:32+05:30

నిబంధనల మేరకు అర్హత కలిగిన కార్డుదారులకు కల్యాణ్‌ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యాన్ని అందిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, డిసెంబరు 30 : నిబంధనల మేరకు అర్హత కలిగిన కార్డుదారులకు కల్యాణ్‌ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యాన్ని అందిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి తెలిపారు. శుక్రవారం ఉల్లిభద్రలో పీఎంజీకేవైపై ఆరా తీశారు. ఉచిత బియ్యం ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయన్న దానిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు జిల్లాలో 94 శాతం మేర కార్డుదారులకు ఉచిత బియ్యం అందించినట్లు చెప్పారు. మొత్తంగా 2.75 లక్షల కార్డులు ఉండగా ప్రస్తుతం 2.60 లక్షల కార్డులకు గాను ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున రేషన్‌ డిపోల బియ్యం అందిస్తున్నట్లు వివరించారు. రేషన్‌ డిపోల్లో సక్రమంగా సరుకులు అందకుంటే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట పార్వతీపురం పౌర సరఫరాల ఉప తహసీల్దార్‌ హెచ్‌.రమణారావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising