ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడని తాగునీటి కష్టాలు

ABN, First Publish Date - 2022-07-28T05:30:00+05:30

తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు నుంచి రెండు నెలల్లో నాలుగు రోజులు మాత్రమే పరిశుభ్రమైన తాగునీరు సరఫరా అయింది. మే నెలాఖరు నుంచి ఇంతవరకు సక్రమంగా తాగునీరు ఇవ్వడం లేదు. బురద నీరు... లేదంటే పూర్తిగా నీటి సరఫరాను నిలిపేయడం చేస్తున్నారు.

అపరిశుభ్రంగా తాగునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రెండు నెలలుగా సక్రమంగా సరఫరా కాని నీరు
 99 గ్రామాల ప్రజలకు  కొనసాగుతున్న తిప్పలు
శృంగవరపుకోట, జూలై 28:
తాటిపూడి పైలెట్‌ ప్రాజెక్టు నుంచి రెండు నెలల్లో నాలుగు రోజులు మాత్రమే పరిశుభ్రమైన తాగునీరు సరఫరా అయింది. మే నెలాఖరు నుంచి ఇంతవరకు సక్రమంగా తాగునీరు ఇవ్వడం లేదు. బురద నీరు... లేదంటే పూర్తిగా నీటి సరఫరాను నిలిపేయడం చేస్తున్నారు. దీంతో ఎస్‌.కోట నియోజకవర్గంలోని 99 గ్రామాల ప్రజలు తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా శృంగవరపుకోట పట్టణ ప్రజలు తాగునీటి కోసం వాటర్‌ ప్లాంటులను ఆశ్రయి స్తున్నారు. రూ.10 నుంచి రూ.40 చెల్లించి టిన్‌లను కోనుగోలు చేసుకుంటు న్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు అధికారులు పర్యవేక్షణల పేరుతో హడావిడి చేస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో తాగునీటి సరఫరాలో నిత్యం అంతరాయం ఏర్పడుతోంది. రెండు నెలల క్రితం బురద నీరు సరఫరా కావడంతో తాగునీటి సరఫరా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పైలెట్‌ ప్రాజెక్టు కేంద్రం వద్ద శుభ్రం చేసేందుకు సరఫరాను కొద్దిరోజులు నిలిపేశారు. ఆ తరువాత మళ్లీ బురద నీరే వచ్చింది. దీంతో మోటార్లు కాలిపోయాయని సరఫరాను ఆపేశారు. వాటిని బాగు చేసి తాగునీటిని సరఫరా చేసినా బురద నీరే వస్తోంది. ఈ పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరస కథనాలు రావడంతో ఉన్నతాధికారులు పర్యవేక్షించి రెండు రోజుల తరువాత పరిశుభ్రమైన తాగునీరు వస్తుందని చెప్పారు. నాలుగు రోజుల పాటు తాగేందుకు అనుకూలమైన నీరు సరఫరా చేశారు. ఇప్పుడు తిరిగి వారం రోజుల నుంచి మళ్లీ యథాస్థితిలో నీరు సరఫరా అవుతోంది. తాగునీటిని సక్రమంగా సరఫరా చేసేందుకు  సిబ్బందితో మాట్లాడానని, ఇక నుంచి రోజూ సరఫరా ఉంటుందని డీఈ గోవిందరావు వివరణ ఇచ్చారు.


Updated Date - 2022-07-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising