వైసీపీ ప్లీనరీలో ఆకలి కేకలు
ABN, First Publish Date - 2022-07-01T05:19:02+05:30
పట్టణ శివారులోని టీటీడీ కల్యాణ మండప ఆవరణలో గురువారం వైసీపీ జిల్లాస్థాయి ప్లీనరీ నిర్వహించారు.
తట్టుకోలేక గేటు దూకి వెళ్లిన కార్యకర్తలు
పార్వతీపురంటౌన్, జూన్ 30: పట్టణ శివారులోని టీటీడీ కల్యాణ మండప ఆవరణలో గురువారం వైసీపీ జిల్లాస్థాయి ప్లీనరీ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం 12కి మొదలైంది. మఽఽధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా పూర్తి కాలేదు. అప్పటికే భారీ వర్షం కురిసింది. ఆకలితో ఉన్న కార్యకర్తలు భోజనాలు పెడుతున్న టీటీడీకల్యాణ మండపంలోకి వెళ్లేందుకు గేటు దూకాల్సి వచ్చింది. గంటసేపు భారీ వర్షం కురవడంతో నాయకులతోపాటు కార్యకర్తలు కల్యాణ మండపంలోకి పరుగులు తీశారు.
Updated Date - 2022-07-01T05:19:02+05:30 IST