రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN, First Publish Date - 2022-08-08T05:44:02+05:30
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మండలం లోని కాశీపట్నం గ్రామ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
మక్కువ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మండలం లోని కాశీపట్నం గ్రామ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కాశీపట్నం గ్రామానికి చెందిన చింతాడ సతీష్(20) శనివారం రాత్రి భోజనం అనంతరం వాకింగ్ కోసం రహదారిపైకి వెళ్లాడు. మక్కు వ నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు, సతీష్ను బలంగా ఢీకొట్టి కింద పడిపోయారు. దీంతో సతీష్కు, వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సతీష్ను మెరు గైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుం డగా మృతిచెందాడు. సతీష్ బొబ్బిలి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల లో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.పైడిరాజు తెలిపారు.
Updated Date - 2022-08-08T05:44:02+05:30 IST