ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెవిలో పూలతో ర్యాలీ

ABN, First Publish Date - 2022-07-28T05:03:48+05:30

జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని చెప్పి విస్మరించిన ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుయువత వినూత్నంగా నిరసన తెలిపింది.

నిరసన తెలియజేస్తున్న తెలుగు యువత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


విజయనగరంలో తెలుగు యువత వినూత్న నిరసన

విజయనగరం రూరల్‌, జూలై 27
: జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని చెప్పి విస్మరించిన ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుయువత వినూత్నంగా నిరసన తెలిపింది. విజయనగరంలోని టీడీపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు బుధవారం చెవిలో పూలు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం కాంప్లెక్స్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ఎన్నో వరాలు ఇచ్చారని, ముఖ్యంగా జాబ్‌ క్యాలెండర్‌ని విడుదల చేస్తామని చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో కూడిన నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగుయువత నాయకులు జి.సురేంద్ర, గంటా రవి, పిన్నింటి కిషోర్‌, పి.సత్యనారాయణ, పి.రాజేష్‌, మంత్రి గోవింద, గేదేల రవీంద్రకుమార్‌, పాలూరి రాజనాయుడు, కర్రోతు పైడిరాజు, కుటుంబరావు, మాతా బుజ్జి, కోదండరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-28T05:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising