బైకును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి
ABN, First Publish Date - 2022-08-08T05:46:44+05:30
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన గొట్లాం గ్రామంలోని బంగారమ్మతల్లి గుడి వద్ద ఆదివారం చోటుచేసుకుంది.
బొండపల్లి: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన గొట్లాం గ్రామంలోని బంగారమ్మతల్లి గుడి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. అంబటివలస గ్రామానికి చెందిన సిరిపురపు తవుడు(36) తన కుటుం బంతో మోటారుబైకుపై విజయనగరం వెళ్లి, స్వగ్రామం వస్తుండగా, లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తవుడు అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య చిన్నమ్మలు, కుమార్తె ప్రణతి, స్వల్ప గాయాలతో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అందిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-08-08T05:46:44+05:30 IST