ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు విచారణలో ముందడుగు.. కడపకు చేరుకున్న విచారణాధికారి

ABN, First Publish Date - 2022-09-23T17:36:48+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణలో ఒక ముందడుగు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kadapa : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణలో ఒక ముందడుగు పడింది. ఈ కేసు కోసం ఢిల్లీ (Delhi) నుంచి సీబీఐ (CBI) విచారణ అధికారి రామ్ సింగ్.. కడపకు చేరుకున్నారు. 5 నెలల విరామం తర్వాత ఢిల్లీ నుంచి రామ్ సింగ్ కడపకు వచ్చారు. రామ్‌సింగ్ రాకతో పులివెందుల(Pulivendula)లో విచారణ ఎదుర్కొంటున్న అనుమానితుల్లో టెన్షన్ మొదలైంది. మరికాసేపట్లో విచారణ కోసం రామ్ సింగ్ పులివెందులకు వెళ్లే అవకాశం ఉంది. 


కాగా.. వివేకా హత్య కేసు (Viveka murder case) విచారణ ఆరు నెలల తర్వాత తిరిగి రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం (R&B Guest House)లో వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను ప్రశ్నించారు. కాగా.. ఇటీవల తన తండ్రి హత్య కేసు విచారణకు ఏపీలో అడ్డంకులు సృష్టిస్తున్నారని కాబట్టి దానిని హైదరాబాద్‌ (Hyderabad)కు బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత (Sunitha) వేసిన పిటిషన్‌పై నిన్న సుప్రీంలో విచారణ జరిగింది. ఈ కేసులో సాక్షులు, సీబీఐ అధికారులకు వస్తున్న బెదిరింపులపై అక్టోబరు 14లోగా సమాధానం ఇవ్వాలంటూ సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2022-09-23T17:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising