ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రులను కాదు.. CMను మార్చాలి: Vishnuvardhan Reddy

ABN, First Publish Date - 2022-06-08T21:28:24+05:30

మూడేళ్ళుగా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: మోసానికి వైసీపీ (YCP) కేరాఫ్ అడ్రస్ అని, మూడేళ్ళుగా ఏపీ (AP) ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని  బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జేపీ నడ్డా పర్యటనతో వైసీపీలో వణుకు మొదలైందన్నారు. నడ్డాపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. దమ్ముంటే ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహం పెట్టాలన్నారు. రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదని సీఎంను మార్చాలన్నారు. ఏపీలో మత విధ్వంసం సంస్థలు పెరిగిపోయాయన్నారు. కోనసీమలో కులాల పేరుతో చిచ్చు పెట్టారని విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు.


ల్యాండ్, ఇసుక, మైనింగ్, లిక్కర్‌తో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. మూడేళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఇళ్ళు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని, జగనన్న కాలనీలు కాదు జగనన్న అవినీతి కాలనీలుగా మారిపోయాయన్నారు. వైసీపీ అజెండా.. జెండా అవినీతి మయమేనన్నారు. ఏపీలో ఆట ఇప్పుడే మొదలైందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-06-08T21:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising