ఏకమైన ఉద్యోగులు.. విశాఖ జిల్లాలో ఉధృతమైన ఆందోళనలు
ABN, First Publish Date - 2022-01-24T00:02:10+05:30
జిల్లా స్థాయిలోనూ ఉద్యోగ జేఏసీల నేతలు ఏకమయ్యారు. ఎన్జీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పీఆర్సీ సాధన సమితిగా ...
విశాఖ: జిల్లా స్థాయిలోనూ ఉద్యోగ జేఏసీల నేతలు ఏకమయ్యారు. ఎన్జీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పీఆర్సీ సాధన సమితిగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సాధన సమితి కన్వీనర్ ఈశ్వర్రావు మాట్లాడుతూ ఈనెల 25న బైక్ ర్యాలీతో నగరమంతా నిరసన చేపడతామన్నారు. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
తమ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి మద్దతు కూడగట్టుకుంటామన్నారు. ఫిబ్రవరి 7న మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అందుకు ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. ఫిట్మెంట్ సీఎం స్థాయిలోనే పరిష్కారం కావాలని చెప్పారు.
‘‘ఉద్యోగుల ఆశల్ని జగన్ అడిఆశలు చేశారు. ఐఆర్ 27 శాతం ఇస్తామని నమ్మించి జగన్ మోసం చేశారు. ఐఆర్ ఇచ్చినట్లే ఇచ్చి ఫిట్మెంట్ 23 శాతానికి పరిమితం చేశారు. పెండింగ్ డీఏ కలిపి జీతాలు పెంచుతున్నామని చెప్పడం మోసపూరితం. అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బైట పెట్టాలి.’’ అని ఈశ్వర్రావు డిమాండ్ చేశారు.
Updated Date - 2022-01-24T00:02:10+05:30 IST