ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-05-26T06:40:32+05:30

బైక్‌ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

సంతోశ్‌కుమార్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుకుంపేట, మే 25: బైక్‌ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కేపీ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం... డుంబ్రిగుడ మండలం కొర్రా గ్రామంలో గ్రావిటీ పథకం పనులు చేపడుతున్న పాడేరు మండలం కుజ్జెలి గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్‌(26), అతని స్నేహితులు మరో ముగ్గురు కలిసి ఒకే బైక్‌పై మంగళవారం పెదబయలు మోదకొండమ్మ ఉత్సవాలకు వెళ్లారు. అర్థరాత్రి తిరుగు ప్రయాణంలో వాళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపు తప్పి మండలంలో మాసాడ ప్రాంతంలో హైవే పనులు జరుగుతున్న వంతెనవద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంతోశ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-05-26T06:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising