ఎరువుల దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
ABN, First Publish Date - 2022-08-18T06:27:29+05:30
మండలంలోని చీడిక కొత్తూరు గ్రామంలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ట్రేడర్స్ పేరుతో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంలో బుధవారం విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది.
రికార్డుల నిర్వహణలో తేడాలు
18 టన్నుల ఎరువులు సీజ్
నక్కపల్లి, ఆగస్టు 17: మండలంలోని చీడిక కొత్తూరు గ్రామంలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ట్రేడర్స్ పేరుతో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంలో బుధవారం విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. రికార్డుల్లో వున్న వివరాలకు, షాపులో వున్న ఎరువుల స్టాకుకు పొంతన లేనట్టు గుర్తించారు. 18 టన్నుల ఎరువులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో చేసినట్టు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, వ్యవసాయాధికారి కె.ఉమాప్రసాద్, ఏఈవో సత్యనారాయణ, వీఏఏ షేక్ రుఫియా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-18T06:27:29+05:30 IST