టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు
ABN, First Publish Date - 2022-05-22T06:48:38+05:30
మండలంలోని కితలంగి పంచాయతీ రంగిసింగ్గూడ గ్రామంలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు మాజీమంత్రి, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్చార్జి కిడారి శ్రావణ్కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు.
రంగిసింగ్గూడలో పార్టీ మారిన 200 కుటుంబాలు
డుంబ్రిగుడ, మే 21: మండలంలోని కితలంగి పంచాయతీ రంగిసింగ్గూడ గ్రామంలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు మాజీమంత్రి, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్చార్జి కిడారి శ్రావణ్కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలన పట్ల విసుగెత్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా గిరిజన ప్రాంతంలోని రోడ్లు,తాగునీరువంటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-22T06:48:38+05:30 IST