ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2022-05-23T06:22:27+05:30

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఘటనా స్థలిలో స్వర్ణ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు చిన్నారులకు గాయాలు

కొమ్మాది, మే 22: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన గొర్లె అర్జునరావు సబ్బవరంలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఆర్ట్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య స్వర్ణ వీఎంఆర్డీఏ (వుడా) పార్కులో టికెట్‌ కలెక్టర్‌గా అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తోంది. వీరు సబ్బవరంలోని జోడుగుళ్లప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో అర్జునరావు సొంతూరైన బుడతనాపల్లికి భార్య స్వర్ణ, ఎనిమిదేళ్ల కుమార్తె భవ్యశ్రీ, నాలుగేళ్ల కుమారుడు అభినవ విద్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుండగా మారికవలస పెట్రోల్‌ బంక్‌ వద్ద వీరి వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొంది. దీంతో కింద పడిపోయిన స్వర్ణ (30) అక్కడికక్కడే మృతి చెందగా, పిల్లలిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. అర్జునరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్‌ పేర్కొన్నారు.


Updated Date - 2022-05-23T06:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising