AP News: టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు: విష్ణుకుమార్రాజు
ABN, First Publish Date - 2022-08-18T01:41:54+05:30
టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్రాజు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
విశాఖపట్నం: టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్రాజు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీచర్లకు ఒక నిబంధన, మిగిలిన వారికి మరో నిబంధన తగదని, అందరికీ ఒకలాగే ఉండాలన్నారు. అసలు మంత్రులు సచివాలయానికి వస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మిగిలిన వారిని నిబంధనల పేరుతో వేధించడం తగదని విష్ణుకుమార్రాజు సూచించారు.
Updated Date - 2022-08-18T01:41:54+05:30 IST