Visakha: అమ్మఒడి ఎగ్గొట్టేందుకు సాకులు వెతుకుతున్న ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-05-29T18:59:22+05:30
Visakhapatnam: అమ్మఒడి పథకానికి కోత పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Visakhapatnam: అమ్మఒడి పథకానికి కోత పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో లబ్దిదారుల విషయంలో అధికారులు రకరకాల కారణాలు చూపి అనర్హుల జాబితాలో చేర్చారు. వెయ్యి చదరపు అడుగులకుపైగా ఉన్న విస్తీర్ణం ఇంటిలో ఉన్నారని కొందరికి... విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చాయని మరి కొందరికి కోత కోశారు.
వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల చదువు కోసం అమ్మఒడి వేస్తామని గొప్పలు చెప్పింది. గతంలో ఒకటో నెలలో ఇచ్చిన అమ్మఒడిని ఇప్పుడు ఆరో నెలకు మార్చింది. గతంలో చాలా మంది విద్యార్థులకు అమ్మఒడి అందింది. ఈసారి అమ్మఒడి అందించేందుకు ప్రభుత్వం నుంచి అడ్డంకులు మొదలయ్యాయి.
Updated Date - 2022-05-29T18:59:22+05:30 IST