AP: స్కూటీని ఢీకొన్న లారీ...యువతి మృతి
ABN, First Publish Date - 2022-03-17T15:14:24+05:30
నగరంలోని సత్యం జంక్షన్లో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది.
విశాఖపట్నం: నగరంలోని సత్యం జంక్షన్లో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. స్కూటీని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతికి తీవ్ర గాయాలు అవడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-03-17T15:14:24+05:30 IST