Visakhaలో రైలు ఢీకొని యువకుడు మృతి
ABN, First Publish Date - 2022-01-11T13:46:26+05:30
నగరంలోని చిమిడిపల్లి సమీపంలో రైలు ఢీకొని దరియా సంతోష్ అనే యువకుడు మృతి చెందాడు.
విశాఖపట్నం: నగరంలోని చిమిడిపల్లి సమీపంలో రైలు ఢీకొని దరియా సంతోష్ అనే యువకుడు మృతి చెందాడు. టైడాకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో టైడాకు చిమిడిపల్లికు మధ్యలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోష్ స్వస్థలం అనంతగిరి మండలం పెడబిడ్డ పంచాయితీ చిమిటి గ్రామం. రైల్వేలో గత కొంతకాలంగా కాంట్రాక్టర్ పద్ధతిలో సంతోష్ పనిచేస్తున్నాడు. సంతోష్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Updated Date - 2022-01-11T13:46:26+05:30 IST