ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ బలోపేతానికి వెంకటరాజు కృషి మరువలేనిది

ABN, First Publish Date - 2022-03-19T06:15:33+05:30

మన్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మత్స్యరాస వెంకటరాజు చేసిన కృషి మరువలేనిదని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

వెంకటరాజు వర్ధంతి సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌

జి.మాడుగుల, మార్చి 18: మన్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మత్స్యరాస వెంకటరాజు చేసిన కృషి మరువలేనిదని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వెంకటరాజు సతీమణి మాజీ మంత్రి మణికుమారి, ఆయన సోదరుడు, టీడీపీ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు మత్స్యరాస వరహాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. వెంకటరాజు ఆలోచనలు గిరిజన ప్రాంత అభివృద్ధిపైనే ఉండేదన్నారు. ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం పలువురు వక్తలు వెంకటరాజు సేవలను కొనియాడారు. అంతకుముందు టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు వెంకటరాజ్‌ ఘాట్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం  క్రికెట్‌ పోటీల్లో విజేతలకు బహుమతులు అంద జేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, టీడీపీ ముఖ్యనాయకులు ఎంవీవీ.ప్రసాద్‌, శెట్టి లక్ష్మణుడు, సివేరి అబ్రహం, బొర్రా నాగరాజు, బొర్రా విజయరాణి, చల్లంగి లక్ష్మణరావు, కొట్టగుళ్లి సుబ్బారావు, సోమెలి చిట్టిబాబు, నాగబ్బాయి, బాకూరు వెంకటరమణరాజు, టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-19T06:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising