ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీని తరిమేసేందుకే ‘వారాహి’: నాదెండ్ల మనోహర్‌

ABN, First Publish Date - 2022-12-10T02:19:50+05:30

వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకే ‘వారాహి’ వాహనం తీసుకుని వచ్చామని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, శ్రీకాకుళం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకే ‘వారాహి’ వాహనం తీసుకుని వచ్చామని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శ్రీకాకుళం, విశాఖల్లో ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. సీఎం, ఆయన సలహాదారులు రాష్ట్ర సంక్షేమాన్ని విస్మరించి.. కేవలం జనసేనపై దృష్టిసారించారని మండిపడ్డారు. జనసేన వాహనంపై చూపిస్తున్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. జనవాణి ద్వారా అందిన వినతులమేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని, యువతకు భరోసా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఇందుకుగాను జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ‘యువశక్తి’ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖ సమావేశంలో పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్‌, పెదపూడి విజయకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T02:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising