ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్య పోరాటాలే శరణ్యం

ABN, First Publish Date - 2022-01-20T05:56:53+05:30

కార్మికుల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

రిలే నిరాహార దీక్షల శిబిరంలో పాల్గొన్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జనవరి 19: కార్మికుల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 342వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో కోక్‌ఓవెన్‌ విభాగం కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్‌లో లేదా ఎన్‌ఎండీసీలో విలీనం చేయాలని సూచించారు. గంధం వెంకటరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కోరారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, ఆనంద్‌, జెర్రిపోతుల ముత్యాలు, కె.సత్యనారాయణ, మస్తానప్ప, రామ్మోహన్‌ కుమార్‌, బొడ్డు పైడిరాజు, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-20T05:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising