ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2022-05-22T06:50:15+05:30

మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురం గ్రామంలో జరిగిన చోరీ కేసును శనివారం పోలీసులు ఛేదించినట్టు సీఐ నారాయణరావు తెలిపారు.

విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ నారాయణరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షలు స్వాధీనం

ఎస్‌.రాయవరం, మే 21: మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురం గ్రామంలో జరిగిన చోరీ కేసును శనివారం పోలీసులు ఛేదించినట్టు సీఐ నారాయణరావు తెలిపారు.ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఈ నెల 19వ తేదిన అర్ధరాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగిందని, ఒక ఇంట్లో రూ.1.5 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారని చెప్పారు. సమాచారం అందిన వెంటనే వెళ్లి క్లూస్‌ టీం ద్వారా పరిశీలించి, సాక్ష్యాధారాలను సేకరించామన్నారు. ఇప్పటికే మూడు కేసులు ఉన్న ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరానికి చెందిన చేపల నానితో పాటు చోడిపల్లి శివపై అనుమానం ఉండడంతో, వారిని వెతికి పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించారన్నారు. వారి నుంచి ఒక ఇంటికి చెందిన రూ.1.5 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేయగా, మరో ఇంటిలో దొంగతనానికి పాల్పడినప్పటికీ ఏమీ పోలేదని ఫిర్యాదుదారుడు చెప్పినట్టు సీఐ తెలిపారు. దుర్వ్యసనాలు, జూదాలకు అలవాటు పడడంతోనే నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. చేపల నాని, చోడిపల్లి శివపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising