నేడు వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల మహోత్సవం
ABN, First Publish Date - 2022-01-22T06:17:46+05:30
ఉత్తరాంధ్రలో పేరుగాంచిన వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల మహోత్సవం శనివారం జరగనుంది.
తుమ్మపాల, జనవరి 21: ఉత్తరాంధ్రలో పేరుగాంచిన వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల మహోత్సవం శనివారం జరగనుంది. ఇందుకోసం ఉత్సవ కమిటీ ప్రతినిధులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రాంగణాలు, రహదారులు, ప్రధాన కూడళ్లను విద్యుత్ సెట్టింగులతో అలంకరించారు. ఉత్సవమూర్తుల ఊరేగింపుతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు.
Updated Date - 2022-01-22T06:17:46+05:30 IST