అప్పన్న కరుణతోనే చిత్ర విజయం
ABN, First Publish Date - 2022-05-21T05:37:15+05:30
సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి కరుణతోనే మహేష్బాబు కథానాయకుడిగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మంచి విజయాన్ని సాధించిందని దర్శకుడు పరశురామ్ అన్నారు.
‘సర్కారువారి పాట’ దర్శకుడు పరశురామ్
సింహాచలం, మే 20: సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి కరుణతోనే మహేష్బాబు కథానాయకుడిగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మంచి విజయాన్ని సాధించిందని దర్శకుడు పరశురామ్ అన్నారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం అప్పన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. సినిమా విజయానికి కారకులైన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభ ఆలింగనం, బేడామండప ప్రదక్షిణ, అంతరాలయంలో పూజలు చేశారు. గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనాలు, అధికారులు ప్రసాదాలను అందజేశారు.
Updated Date - 2022-05-21T05:37:15+05:30 IST