ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వానివి దగాకోరు విధానాలు

ABN, First Publish Date - 2022-09-17T05:32:48+05:30

వైసీపీ ప్రభుత్వ దగాకోరు విధానాల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రావాడలో నిరసన ర్యాలీ చేపడుతున్న బండారు సత్యనారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- జగన్‌ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే..

- ‘బాదుడే బాదుడు’లో మాజీ మంత్రి ‘బండారు’

పరవాడ, సెప్టెంబరు 16 : వైసీపీ ప్రభుత్వ దగాకోరు విధానాల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి మండలంలోని రావాడలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగడాలు చేతపట్టి మహిళలు, యువకులతో కలిసి కాలనీలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.  పథకాల పేరుతో రాష్ట్రాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధోగతి పాలుజేశారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు సీఎం కావడం తథ్యమన్నారు.  మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ పైలా జగన్నాథరావు, టీడీపీ నాయకులు అట్టా సన్యాసి అప్పారావు, వియ్యపు చిన్నా, బొండా తాతారావు, బొండా సన్నిదేముడు, పైలా వరలక్ష్మి, సారిపల్లి జోగినాయుడు, చినఅక్కునాయుడు, సారిపల్లి ఆనంద్‌, షేక్‌ మదీనా, మరిశా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-17T05:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising