చంద్రబాబుపై కక్ష.. మాపై తీర్చుకుంటున్నారు
ABN, First Publish Date - 2022-12-02T04:22:53+05:30
వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్షను తమపై తీర్చుకుంటోందని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వద్ద మొర పెట్టుకున్నారు.
సీపీఐ రామకృష్ణ వద్ద టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల మొర
విజయవాడ రూరల్, డిసెంబరు 1: వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్షను తమపై తీర్చుకుంటోందని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వద్ద మొర పెట్టుకున్నారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లను సీపీఐ బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా నేతల వద్ద లబ్ధిదారులు తమ గోడు వెలిబుచ్చారు. పరిస్ధితులను గమనిస్తే చంద్రబాబుపై పగను జగన్ తమపై తీర్చుకుంటున్నారని అర్థమవుతోందని, ఇది ఎంతవరకు న్యాయమని కన్నీటి పర్యంతమయ్యారు.
Updated Date - 2022-12-02T04:22:54+05:30 IST