ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది
ABN, First Publish Date - 2022-12-10T01:28:41+05:30
ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని ఉప ముఖ్యమంత్రి బూడి.ముత్యాలనాయుడు అన్నారు.
దేవరాపల్లి, డిసెంబరు 9: ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని ఉప ముఖ్యమంత్రి బూడి.ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని ఎం.అలమండలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ఆర్బీకేల్లో రైతులు విక్రయించు కోవ చ్చునన్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు ముఖ్య మంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. మిల్లర్ల ప్రమే యం లేకుండా ఈ-క్రాప్ నమోదు చేయించుకున్న రైతులంతా ఆర్బీకేల్లో విక్రయించవచ్చనన్నారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో నగదు రైతు ఖాతాలోకి జమ అవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ రవి పట్టంశెట్టి, సంయుక్త కలెక్టర్, కల్పనాకుమారి, ఎం.అలమండలో కొనుగోలు చేసిన ధాన్యం లారీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ ప్రసాదు, ఎం.శ్రీలత, ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, నాయకులు బూరే బాబూరావు, అవుగడ్డ రమాదేవీ, సర్పంచ్ జగన్, బండారు ప్రసాదు, పోతల శంకరు, పోతల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-10T01:28:43+05:30 IST