ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేలాది మందితో జనగణమన ఆలాపన అభినందనీయం

ABN, First Publish Date - 2022-01-25T06:18:18+05:30

ప్రజల్లో జాతీయ భావం ఉట్టిపడేలా విశాఖ వేదికగా జూమ్‌ ఆన్‌లైన్‌, యూట్యూబ్‌ మాధ్యమాల ద్వారా జనగణమన గీతాలాపన జరిగింది.

జనగణమన గీతం ఆలపిస్తున్న మేయర్‌, ఎమ్మెల్సీ, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి

సిరిపురం, జనవరి 24: ప్రజల్లో జాతీయ భావం ఉట్టిపడేలా విశాఖ వేదికగా జూమ్‌ ఆన్‌లైన్‌, యూట్యూబ్‌ మాధ్యమాల ద్వారా జనగణమన గీతాలాపన జరిగింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకునేందుకు గాను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా యాక్ష్మి, ఐటీసీ గ్లోబల్‌ అండ్‌ డార్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో జనగణమన గీతాలాపన కార్యక్రమాన్ని సోమవారం హోటల్‌ మేఘాలయాలో నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వకవి, నోబెల్‌ బహుమతి విజేత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన జనగణమనను జాతీయ గీతంగా 1950 జనవరి 24న రాజ్యాంగం ఆమోదించిందన్నారు. సరిగ్గా అలాంటి రోజున వేలాది మందితో జనగణమన పాడించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ జాతీయ గీతం భారత జాతి సమగ్రతను చాటిచెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయుడు వీవీ రమణమూర్తి, యాక్ష్మి వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ప్రతాప్‌కుమార్‌, ఈస్ట్‌ ఏసీపీ హర్షిత చంద్ర, పి.రతన్‌రాజు, డి.లాజరస్‌, పి.హర్షిత, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-25T06:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising