ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ నిరసనలు
ABN, First Publish Date - 2022-07-02T06:31:15+05:30
ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు శుక్రవారం ఇక్కడ పిలుపునిచ్చారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు
అనకాపల్లి అర్బన్, జూలై 1 : ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు శుక్రవారం ఇక్కడ పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబరులో చార్జీలు పెంచి ప్రజల నెత్తిన రూ.675 కోట్ల భారం మోపారన్నారు. ఇప్పుడు రెండోసారి రూ.1500 కోట్లు వెరసి రూ. 2175కోట్ల భారం వేశారని ఆరోపించారు. పేదలు ప్రయాణం చేసే పల్లె వెలుగుపై కిలో మీటరుకు పది పైసలు భారం వేయడం సరికాదన్నారు. ఆర్ట్టీసీ ఖాళీ స్థలాలపై కన్నేసి కబళించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెంచిన చార్జీలు ఉపసంహరించుకునే వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టాలని సూచించారు.
Updated Date - 2022-07-02T06:31:15+05:30 IST