ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ నిరసనలు

ABN, First Publish Date - 2022-07-02T06:31:15+05:30

ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు శుక్రవారం ఇక్కడ పిలుపునిచ్చారు.

బుద్ద నాగ జగదీశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు


అనకాపల్లి అర్బన్‌, జూలై 1 : ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు శుక్రవారం ఇక్కడ పిలుపునిచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబరులో చార్జీలు పెంచి ప్రజల నెత్తిన రూ.675 కోట్ల భారం మోపారన్నారు. ఇప్పుడు రెండోసారి రూ.1500 కోట్లు వెరసి రూ. 2175కోట్ల భారం వేశారని ఆరోపించారు. పేదలు ప్రయాణం చేసే పల్లె వెలుగుపై కిలో మీటరుకు పది పైసలు భారం వేయడం సరికాదన్నారు. ఆర్ట్టీసీ ఖాళీ స్థలాలపై కన్నేసి కబళించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెంచిన చార్జీలు ఉపసంహరించుకునే వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టాలని సూచించారు. 

Updated Date - 2022-07-02T06:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising