టీడీపీ నాయకుడు ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-05-21T05:39:14+05:30
పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియరు నాయకుడు దాసరి వెంకటేష్ (57) శుక్రవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక లంకాడవారి వీధిలో నివశిస్తున్న ఇతడు గతంలో మునిసిపాలిటీ 19వ వార్డు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
భీమునిపట్నం, మే 20: పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియరు నాయకుడు దాసరి వెంకటేష్ (57) శుక్రవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక లంకాడవారి వీధిలో నివశిస్తున్న ఇతడు గతంలో మునిసిపాలిటీ 19వ వార్డు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. సుమారు నెలరోజులుగా బయటకు చెప్పలేని సమస్యలతో సతమతమవుతుండేవారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. సాగర సంగమం వద్ద అతడి మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. సీఐ జీవీ రమణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చిన్నబజారు గాడు వీధి శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల్లో పలువురు పట్టణ నాయకులు పాల్గొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. ఇదిలా వుండగా వెంకటేష్ తండ్రి కూడా గతంలో అదే ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు.
Updated Date - 2022-05-21T05:39:14+05:30 IST