ఎంపీ సత్యవతిని అవమానించటం మంత్రికి తగదు
ABN, First Publish Date - 2022-05-19T06:09:53+05:30
గవర కులానికి చెందిన అనకాపల్లి వైసీపీ ఎంపీ బి.సత్యవతిని అవమానపరిచే విధంగా రాష్ట్ర మంత్రి అమర్నాథ్ వ్యవహరించటం సరికాదని కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్ఆర్ అప్పారావు అన్నారు.
కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్ఆర్ అప్పారావు
గాజువాక, మే 18: గవర కులానికి చెందిన అనకాపల్లి వైసీపీ ఎంపీ బి.సత్యవతిని అవమానపరిచే విధంగా రాష్ట్ర మంత్రి అమర్నాథ్ వ్యవహరించటం సరికాదని కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు ఆర్ఆర్ అప్పారావు అన్నారు. గాజువాకలో ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఎంపీ ఫొటోను తీయించటమే కాకుండా, ఎంపీ వస్తే ఆ కార్యక్రమానికి రానని మంత్రి అనటం అవమానించటమేనని వివరించారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునారావృతం కాకుండా ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గాజువాక గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు మారిశెట్టి మల్లెపూలరావు, కేంద్ర గౌరీ సంఘం ఉపాధ్యక్షుడు బి.వెంకటరావు, ప్రతినిధులు మల్ల అనంతరావు, సింహాచలం పాల్గొన్నారు.
Updated Date - 2022-05-19T06:09:53+05:30 IST