ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

ABN, First Publish Date - 2022-05-26T05:24:41+05:30

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ఎ.మల్లికార్జున

విశాఖపట్నం, మే 25: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రవాణా సదుపాయాలు మెరుగుపరిచి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.


వివిధ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల గుంతలకు ప్యాచ్‌ వర్క్‌లు పూర్తి చేయాలని, ముఖ్యంగా బీఆర్‌టీఎస్‌ రోడ్డులో కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి పెందుర్తి వరకు ఉన్న గోతులు కప్పాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ అధికారులు సూచించినట్లు జిల్లాలో 80 చోట్ల ఉన్న బ్లాక్‌ స్పాట్‌లు పరిశీలించి అవసరమైన హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


ఈ సందర్భంగా షీలానగర్‌-సబ్బవరం రోడ్డు పనుల ప్రగతి అడిగి తెలుసుకున్నారు. వెంకోజిపాలెం-హనుమంతవాక మధ్య హైవేపై వర్షం కురిసినప్పుడల్లా భారీగా నీరు  చేరుతున్నందున అవసరమైన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీటీసీ రాజరత్నం, పోలీసు, జీవీఎంసీ, హైవే, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T05:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising