రాష్ట్ర స్థాయి మహిళల ఫుట్బాల్ టోర్నీ ప్రారంభం
ABN, First Publish Date - 2022-05-28T05:01:50+05:30
ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల ఫుట్బాల్ చాంపియన్ షిప్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది.
తొలిరోజు మ్యాచ్ల్లో ఆతిథ్య విశాఖ జట్టు ఓటమి
విశాఖపట్నం (స్పోర్ట్సు), మే 27: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల ఫుట్బాల్ చాంపియన్ షిప్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. పోర్టు స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలను ఫుట్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ ప్రారంభించి క్రీడాకారిణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ సంఘం ప్రతినిధులు ఎ.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మ్యాచ్ల్లో ఆతిథ్య విశాఖ జట్టు ఓడిపోయింది.
తొలిరోజు ఫలితాలు:
తొలి మ్యాచ్లో కడప 11-0 గోల్స్ తేడాతో కృష్ణాపై ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్లో చిత్తూరు 4-1 గోల్స్ తేడాతో పశ్చిమ గోదావరిపై గెలుపొందింది. మరో మ్యాచ్లో కర్నూలు 4-0 గోల్స్ తేడాతో విశాఖపై విజయం సాధించింది.
Updated Date - 2022-05-28T05:01:50+05:30 IST