ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో ప్రమాణాలతో కూడిన విద్యా బోధన

ABN, First Publish Date - 2022-08-07T06:37:11+05:30

పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యాబోధన సాగేలా ఎంఈవోలు దృష్టిసారించాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి సూచించారు. కొప్పాకలోని విద్యాశాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లాలోని ఎంఈవోలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో లింగేశ్వరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎంఈవోల సమీక్షలో డీఈవో లింగేశ్వరరెడ్డి ఆదేశం

అనకాపల్లి రూరల్‌, ఆగస్టు 6 : పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యాబోధన సాగేలా ఎంఈవోలు దృష్టిసారించాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి సూచించారు. కొప్పాకలోని విద్యాశాఖ కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లాలోని ఎంఈవోలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.  నెలవారీ టూర్‌ ప్రొగ్రామ్‌ను ఎంఈవోలు విధిగా తెలియపర్చాలన్నారు.  జూలై నెలలో పర్యటించిన పాఠశాలలు, తనిఖీ నివేదికలపై ఆరా తీశారు.  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కేటగిరీల వారీగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఖాళీల వివరాలను నమోదు చేసుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఉన్న సబ్జెక్టుల వారీగా టీచర్ల కొరతను తెలుసుకున్నారు. ఉదయం పది గంటల లోపు అటెండెన్స్‌ యాప్‌లో కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు నమోదు, బేస్‌లైన్‌ పరీక్షల మార్కులు అప్‌లోడ్‌ చేయకపోవడంపై  డీఈవో అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-07T06:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising