ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో ప్రభుత్వం కుట్ర: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-04-20T17:12:20+05:30

జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్ ప్రభుత్వంపై  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో ప్రభుత్వ కుట్ర కోణం ఉందన్నారు. ప్రజలపై బలవంతంగా ఒత్తిడి పెంచుతోందని విమర్శించారు. గాజువాక, అనకాపల్లి, నర్సాపురం, కాకినాడ నంద్యాల పట్టణంలో సర్వే నిర్వహిస్తే మెజార్టీ ప్రజలు బియ్యమే కావాలంటున్నారని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా  లబ్దిదారులు బియ్యం కోరుకుంటున్నారన్నారు. నరసాపురంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసిందన్నారు. ఇంటింటి రేషన్ పథకాన్ని అటకెక్కించేదుకే ఈ తంతు జరుగుతోందని ఆరోపించారు. పోర్టుల ద్వారా బియ్యాన్ని విదేశాలకు పంపించే కుట్రలో భాగం ఇదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దొడ్డిదోవన రేషన్ బియ్యాన్ని సన్నాలుగా మారుస్తున్నారని, వీటి వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని సోము వీర్రాజు ఆరోపించారు.

Updated Date - 2022-04-20T17:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising