ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి జగనన్న ఇళ్లపై సోషల్‌ ఆడిట్‌

ABN, First Publish Date - 2022-11-12T01:18:04+05:30

జగనన్న కాలనీల్లో అనేక మోసాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌

డాబాగార్డెన్స్‌, నవంబరు 11 : జగనన్న కాలనీల్లో అనేక మోసాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ ఆరోపించారు. డాబాగార్డెన్స్‌ వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ’జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో పోస్టర్‌ను ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14 తేదీల్లో జన సైనికులు జగనన్న కాలనీలను పరిశీలించి అధిష్ఠానానికి నివేదిక అందజేయాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదేశించారని తెలిపారు. .14న సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నామని వివరించారు. పీఏసీ సభ్యుడు కోన తాతారావు మాట్లాడుతూ ప్రజలకు ప్రయోజనం లేని చోట్ల ఇళ్లను కేటాయించారని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని మోదీకి పవన్‌కల్యాణ్‌ వివరించారని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, ఉత్తర ఇన్‌చార్జ్‌ పసుపులేటి ఉషాకిరణ్‌, నాయకులు గడసాల అప్పారావు, సంకు వెంకటేశ్వరరావు, వసంతలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T01:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising