ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సీఎం జగన్‌పై శైలజానాథ్ ఘాటైన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-10T18:34:03+05:30

సీఎం జగన్‌పై పీసీసీ చీఫ్ శైలజానాథ్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ (Visakha): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై పీసీసీ చీఫ్ శైలజానాథ్ రెడ్డి (Shailajanath Reddy) ఘాటైన వ్యాఖ్యలు (Comments) చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో (AP) పాలన ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అంతా ఆరాచకమే జరుగుతోందని, సీఎం జగన్ (CM Jagan), ప్రధాని మోదీ (PM Modi) కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రధానికి జగన్ దాసోహం అయిపోయారని, అందుకే ప్రత్యేక హోదా (Special Status) అడగడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతున్నా... అడగవాల్సిన ముఖ్యమంత్రి, మోదీ కాలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. అందుకే 175 స్థానాలు వస్తాయని సీఎం జగన్ అంటున్నారని, ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. రుషికొండను చూస్తే పాలన ఎలా ఉందో తెలుస్తోందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్‌లో ఇంకెంత మంది ఇలా దర్శనం ఇస్తారోనని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-10T18:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising