సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలి
ABN, First Publish Date - 2022-06-28T05:38:12+05:30
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
సీపీఎం డిమాండ్
గొలుగొండ, జూన్ 27 : ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు సాపిరెడ్డి నారాయణమూర్తి మాట్లాడుతూ.. పాతమల్లంపేట, కొత్తఎల్లవరం, బుడ్డడపాడు, పోలవరం, గదబపాలెం, డొంకాడ గ్రామాల్లో సాగు చేపడుతున్న భూములకు సాగు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు వరి సాగు తగ్గించారన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-28T05:38:12+05:30 IST