ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులకు పరిహారంపై ప్రజలకు అవగాహన ఉండాలి

ABN, First Publish Date - 2022-05-25T06:45:35+05:30

బాధితులకు పరిహారం అందేలా రూపొందించిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాఽథ శర్మ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాఽథ శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాఽథ శర్మ

విశాఖపట్నం, మే 24: బాధితులకు పరిహారం అందేలా రూపొందించిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాఽథ శర్మ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టుల ఆవరణలోని గ్రంథాలయంలో  బాధితులకు పరిహారం అనే అంశంపై  ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయ అవగాహనా కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.  క్రిమినల్‌ కేసుల్లో బాధితులకు పరిహారాన్ని అందించేందుకు వివిధ పథకాలు ఉన్నాయని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్‌. శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బులికృష్ణ, న్యాయమూర్తులు శ్రీనివాసరావు, గోవర్ధన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ శైలజ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రవీంద్రప్రసాద్‌, కార్యదర్శి వేణుగోపాల్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌.కృష్ణమోహన్‌, ప్యానెల్‌ అడ్వకేట్‌ ఆర్‌.శ్రీనివాసరావు, న్యాయవాదులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T06:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising