పోర్టు ‘సాగరమాల’ ఆడిటోరియం ప్రారంభం
ABN, First Publish Date - 2022-03-06T05:10:48+05:30
జీవీఎంసీ 45వ వార్డు సాలిగ్రామపురం సీతారామ కల్యాణ మండపం ఎదుట విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ నిర్మించిన సాగరమాల సమావేశ మందిరాన్ని చైర్మన్ కె.రామ్మోహనరావు శనివారం సాయంత్రం ప్రారంభించారు.
ప్రారంభించిన చైర్మన్ రామ్మోహనరావు
విశాఖపట్నం, మార్చి 4 : జీవీఎంసీ 45వ వార్డు సాలిగ్రామపురం సీతారామ కల్యాణ మండపం ఎదుట విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ నిర్మించిన సాగరమాల సమావేశ మందిరాన్ని చైర్మన్ కె.రామ్మోహనరావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా లైవ్ గజల్ కన్సర్ట్, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ గజల్ గాయకుడు డాక్టర్ హరిఓం హిందీ, తెలుగు గజల్స్ ఆలపించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:10:48+05:30 IST