పింఛన్ పునరుద్ధరించరూ..
ABN, First Publish Date - 2022-12-07T00:31:21+05:30
చ్చిన హామీ మేరకు నిలిపివేసిన వృద్ధాప్య పింఛన్ పునరుద్ధరించాలని మండలంలోని చింతపాకకి చెందిన సలాది గంగమ్మ(85) ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీని కోరుతున్నది.
బుచ్చెయ్యపేట, డిసెంబరు 6: ఇచ్చిన హామీ మేరకు నిలిపివేసిన వృద్ధాప్య పింఛన్ పునరుద్ధరించాలని మండలంలోని చింతపాకకి చెందిన సలాది గంగమ్మ(85) ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీని కోరుతున్నది. తన భర్త 40 సంవత్సరాల క్రితమే చనిపోయారని, తనకు రూ.30 నుంచి వితంతు పింఛన్ వచ్చిందని పేర్కొంది. ఏడాది క్రితం వరకు సజావుగా పింఛన్ వచ్చిందని, వేలిముద్రలు పడడం లేదంటూ అధికారులు నిలిపేశారని గంగమ్మ వాపోయింది. దీంతో గంగమ్మ బతుకు స్థానికల దయా ధర్మాలపై ఆధారపడింది. ఏడాది నుంచి గంగమ్మ వినతులను అధికారులెవరూ పట్టించుకోలేదు. దీంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ధర్మశ్రీకి గంగమ్మ తన గోడును చెప్పుకుంది. తక్షణం పింఛను పునరుద్ధరించాలని అధికారులను ఎమ్మెల్యే కె.ధర్మశ్రీ ఆదేశించారు. అయితే ఎనిమిది నెలలైనా అయినా ఆమెకు అధికారులు పింఛన్ను పునరుద్ధరించలేదు. పింఛన్ పునరుద్ధరణపై ఎమ్మెల్యే కె.ధర్మశ్రీ హామీ ఇవ్వడంతో తన కష్టాలు తొలగిపోతాయని ఆశించిన గంగమ్మకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రత్యేక దృష్టి సారించి పింఛన్ మంజూరు చేయించాలని గంగమ్మ కోరుతున్నది.
Updated Date - 2022-12-07T00:31:23+05:30 IST