ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని పట్టించుకోరేం?

ABN, First Publish Date - 2022-08-08T05:45:13+05:30

అనకాపల్లి పట్టణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు స్థానిక ట్యాంకు బండ్‌ పార్కులో ఆస్పత్రి భవనం నిర్మించడానికి సంకల్పించారు.

ఎన్‌టీఆర్‌ ప్రభుత్వాస్పత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- శిథిలావస్థకు చేరుతున్న భవనం

- పిల్లర్లు పెచ్చులూడి ఊచలు బయటకు వచ్చిన వైనం

- బీటలు వారిన గోడలు

- ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రోగుల్లో ఆందోళన

అనకాపల్లి జిల్లాలో అత్యంత ప్రాధాన్యం గల ఎన్టీఆర్‌ వైద్యాలయం శిథిలావస్థకు చేరుకుంటోంది. భవనాన్ని ప్రారంభించిన రెండు దశాబ్దాలకే మరమ్మతులకు గురైంది. స్తంభాలు పగిలిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. గోడలు బీటలువారిపోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. 

అనకాపల్లి అర్బన్‌, ఆగస్టు 7: అనకాపల్లి పట్టణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అప్పటి మంత్రి దాడి వీరభద్రరావు స్థానిక ట్యాంకు బండ్‌ పార్కులో ఆస్పత్రి భవనం నిర్మించడానికి సంకల్పించారు. ఈ పార్కు 5.37 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. పార్కు మధ్యన చిన్నపాటి చెరువు కూడా ఉండేది. ఆ చెరువును పూడ్చేసి రూ.5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. అన్ని హంగులతో ఆస్పత్రిని నిర్మించడమే కాకుండా వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని 2002లో అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. అలాగే 2012లో మాతా శిశు సంక్షేమ కేంద్రం భవనానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ భవనంలో కేవలం ప్రసూతికి సంబంధించిన 150 పడకలను ఏర్పాటు చేశారు. 2017 ఏప్రిల్‌ 11న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవనాన్ని ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో 250 పడకల ఆస్పత్రి ఏర్పాటు అయింది. అయితే ఈ ఆస్పత్రిలో ముందుగా నిర్మించిన భవనానికి సంబంధించిన స్తంభాలు బీటలువారి పెచ్చులూడి పడిపోతున్నాయి. అలాగే గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇనుప ఊచలు బయట పడడంతో స్తంభాల్లో పటుత్వం కోల్పోతోంది. ఇప్పటికే ఈ స్తంభాలకు మరమ్మతులు చేసి ఉంటే కాస్త మెరుగుపడి ఉండేవి. కానీ అధికారులు పట్టించుకోలేదు. స్తంభాలన్నీ ఇదే మాదిరిగా బలహీనపడితే భవనం పరిస్థితి ఏమిటని అక్కడకు వచ్చే రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ భవనానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-08-08T05:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising