ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు

ABN, First Publish Date - 2022-03-23T06:15:21+05:30

స్టిల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 404వ రోజుకు చేరుకున్నాయి

రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, మార్చి 22: స్టిల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 404వ రోజుకు చేరుకున్నాయి. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం విక్రయానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవటం వల్లనే కార్మికులకు వేతనాలను సక్రమంగా ఇవ్వకుండా అడ్డుకుంటున్నదని ఆరోపించారు. దేశంలో తమకు అనుకూలమైన కార్పొరేట్‌లకు ప్రభుత్వ సంస్థలను కట్టబెట్టాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. పోరాట కమిటీ నాయకుడు మాటూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే నిర్వాసితులకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో గంధం వెంకటరావు, మస్తానప్ప, వరసాల శ్రీనివాసరావు, కేఎస్‌ఎన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-23T06:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising