ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ కోసం మైళ్ల దూరం నడక

ABN, First Publish Date - 2022-03-04T06:07:47+05:30

మండలంలోని పెద్దఅగ్రహారం ఆదివాసీలు రేషన్‌ సరకుల కోసం 12 కిలోమీటర్లు నడిచి తెచ్చుకుంటున్నారు. పెద్ద అగ్రహారం గ్రామానికి రహదారి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పెద్దఅగ్రహారం ఆదివాసీలకు తప్పని కష్టాలు

గూడెంకొత్తవీధి, మార్చి 3: మండలంలోని పెద్దఅగ్రహారం ఆదివాసీలు రేషన్‌ సరకుల కోసం 12 కిలోమీటర్లు నడిచి తెచ్చుకుంటున్నారు. పెద్ద అగ్రహారం గ్రామానికి రహదారి ఉంది. గ్రామంలో జీసీసీ సబ్‌ డిపో కూడా ఉంది.. అయినా సివిల్‌ సప్లయ్స్‌, జీసీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీలకు రేషన్‌ కష్టాలు తప్పడంలేదు. గురువారం గ్రామానికి చెందిన గిరిజనులు జీకేవీధి డీఆర్‌ డిపో నుంచి రేషన్‌ బియ్యం తీసుకు వెళుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యను విలేకర్లకు వివరించారు. మండలంలోని పెద్దఅగ్రహారం జీసీసీ సబ్‌ డిపో పరిధిలో వంద రేషన్‌ కార్డులున్నాయి. గతంలో ఈ డిపో నుంచే సరకులను సరఫరా చేసేవారు. ప్రస్తుతం రవాణా ఖర్చు పెరిగిపోతుందనే సాకుతో పౌరసరఫరాలు, జీసీసీ అధికారులు పెద్దఅగ్రహారం పరిధిలోనున్న కార్డుదారు లకు జీకేవీధి ప్రధాన డిపో నుంచే రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా గిరిజనులు 12 కిలోమీటర్లు తలపై బియ్యం మూటలను పెట్టుకొని నడిచి వెళుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అగ్రహారం గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు గోవిందరావు, సుబ్బారావు, పార్వతి, చిలకమ్మ విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2022-03-04T06:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising