ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-24T06:21:56+05:30

జీవీఎంసీ 85వ వార్డు పరిధి ఫార్మాసిటీ పునరావాస కాలనీ లేమర్తిలో భర్తతో విభేధాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

వరలక్ష్మి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగనంపూడి, జనవరి 23: జీవీఎంసీ 85వ వార్డు పరిధి ఫార్మాసిటీ పునరావాస కాలనీ లేమర్తిలో భర్తతో విభేధాల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. లేమర్తికి చెందిన దంపతులు ముమ్మన మల్లేశ్వరరావు, ముమ్మన వరలక్ష్మి(38) ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. ఇరువురూ ఫార్మాసిటీలో గల రెండు వేర్వేరు పరిశ్రమల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఇటీవల కుమార్తె చంద్రిక, కుమారుడు సాయి  అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో వరలక్ష్మి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి కొన  ఊపిరితో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం అగనంపూడి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భర్త మల్లేశ్వరరావును దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-01-24T06:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising