ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-06-26T04:45:04+05:30

రైల్వే ట్రాక్‌ దాటుతున్న ఓవ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన లంకెలపాలెం సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది.

ప్రమాదంలో మృతి చెందిన రాజేంద్రభగతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంకెలపాలెం, జూన్‌ 25:  రైల్వే ట్రాక్‌ దాటుతున్న ఓవ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన లంకెలపాలెం సమీపంలో శనివారం సాయంత్రం  జరిగింది. దువ్వాడ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాకు చెందిన రాజేంద్ర భగతి (30) లంకెలపాలెం క్యాటరింగ్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ రహదారి కూడలి నుంచి తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తూ రైల్వే ట్రాక్‌ దాటే క్రమంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్లే  రైలు ఢీకొంది. ఈప్రమాదంలో రాజేంద్ర భగతి సుమారు పది మీటర్లు ఎగిరి పడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు నెల రోజుల కిందటే ఉపాధి నిమిత్తం ఇక్కడకు వలస వచ్చాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.  జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్‌ం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-06-26T04:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising