ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-05-26T06:08:58+05:30

జాతీయ రహదారిపై నాతయ్యపాలెం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం, మే 25: జాతీయ రహదారిపై నాతయ్యపాలెం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాతయ్యపాలెంకు చెందిన గోపిశెట్టి నాగరాజు(42) తాపీ మేస్త్రిగా  పనిచేస్తున్నాడు. బుధవారం విధుల నుంచి వచ్చిన నాగరాజు, కూరగాయల కోసం రహదారి దాటుతుండగా, కారు ఢీకొంది. సుమారు పది మీటర్ల దూరంలో పడిన నాగరాజు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినప్పటికీ, నాగరాజును ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న నాగరాజు భార్య, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి  చేసిన రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్‌కు తరలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-05-26T06:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising