అవయవదానంపై అవగాహన అవసరం
ABN, First Publish Date - 2022-08-12T05:21:33+05:30
సమాజంలో అవయవదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని సావిత్రీబాయి పూలే ట్రస్ట్ అధ్యక్షురాలు జి. సీతామహలక్ష్మి తెలిపారు.
సావిత్రీబాయిపూలే ట్రస్ట్ అధ్యక్షురాలు సీతామహలక్ష్మి
చోడవరం, ఆగస్టు 11: సమాజంలో అవయవదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని సావిత్రీబాయి పూలే ట్రస్ట్ అధ్యక్షురాలు జి. సీతామహలక్ష్మి తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ అవయవదాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతామహలక్ష్మి అవయవదానం గురించి, పార్ధివదేహం దానం ఏ విధంగా చేయాలనేదానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రామచంద్రరావు, వైస్ ప్రిన్సిపాల్ కిరణ్, ఎన్ఎస్ఎస్ యూనిట్ పీవోలు మాల్యాద్రి, పిచ్చమ్మ, న్యాయవాది కళావతి, కన్యాకుమారి, సేవా కార్యకర్తలు బాబ్జి, దేముడు, నానాజీ, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతామహలక్ష్మిని కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు సత్కరించారు.
Updated Date - 2022-08-12T05:21:33+05:30 IST