కనకమహాలక్ష్మి ఈఓగా శాంతి బాధ్యతల స్వీకారం
ABN, First Publish Date - 2022-03-05T06:39:14+05:30
కనక మహాలక్ష్మి దేవస్థానం ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ కాళింగరి శాంతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు.
విశాఖపట్నం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): కనక మహాలక్ష్మి దేవస్థానం ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ కాళింగరి శాంతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆలయ అభివృద్ధికి ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులు ఆమెను పుష్పగుచ్ఛాలతో అభినందించారు.
Updated Date - 2022-03-05T06:39:14+05:30 IST